‘లక్ష’ణంగా రికవరీ
ABN , First Publish Date - 2020-09-23T06:59:18+05:30 IST
దేశంలో కరోనా నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. మంగళవారం ఉదయం 8 గంటలకు గడిచిన
కరోనా నుంచి ఒక్క రోజే కోలుకున్న 1.01 లక్షల మంది
న్యూఢిల్లీ, సెప్టెంబరు 22: దేశంలో కరోనా నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. మంగళవారం ఉదయం 8 గంటలకు గడిచిన 24 గంటల్లో ఏకంగా 1,01,468 మంది రికవరీ అయ్యారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది. ఈ వ్యవధిలో నమోదైన పాజిటివ్లు 75,809 మాత్రమే కావడం గమనార్హం.
మరోవైపు వరుసగా 21వ రోజు దేశంలో వెయ్యిపైగా మరణాలు సంభవించాయి. రికవరీ రేటు 80.86కు చేరిందని, మరణాల రేటు 1.60కి తగ్గిందని కేంద్రం వివరించింది. కాగా, 9,75,861 యాక్టివ్ కేసులున్నట్లు వివరించింది. ఫిబ్రవరి మొదటి వారంలో విదేశాల నుంచి వచ్చేవారికి విమానాశ్రయాల్లో తప్పనిసరిగా కొవిడ్-19 పరీక్ష నిర్వహించాల్సిన అవసరం రాలేదని కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి మురళీధరన్ రాజ్యసభలో పేర్కొన్నారు.