కేరళలో ఆరు జిల్లాల్లో రెడ్ అలర్ట్
ABN , First Publish Date - 2020-08-10T17:18:28+05:30 IST
కేరళలో రాగల 24 గంటల్లో అతిభారీ వర్షాలు కురుస్తామని భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
తిరువనంతపురం: కేరళలో రాగల 24 గంటల్లో అతిభారీ వర్షాలు కురుస్తామని భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది. కాసరగోడ్, కల్నూల్, వైనాడ్, కోజికోడ్, మల్లపురం, అలక్పూజ జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది. రాగల 24 గంటల్లో ఈ జిల్లాల్లో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. భారీ వర్షాలు, వరదలకు కేరళ వణికిపోతోంది. ఎక్కడ చూసినా నిండా మునిగిన రోడ్లు, వర్షపునీటిలో చిక్కుకున్న ఇళ్లే కనిపిస్తున్నాయి. వరద ప్రవాహ ఉధృతికి భారీ వాహనాలు కొట్టుకుపోయిన ఘటనలు నమోదయ్యాయి.
కొట్టాయంజిల్లా మనర్కడ్లో ఓ కారు కొట్టుకుపోవడంతో అంగమలైకి చెందిన ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. కొట్టాయం, అలక్పూజ జిల్లాలను జడివానలు వణికిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. దాంతో ఈ రెండు జిల్లాల్లో వందలాది కుటుంబాలను అధికారులు సహాయక శిబిరాలకు తరలించారు.