నిన్నటి ఘటనకు సిద్ధూయే బాధ్యుడు: రైతులు

ABN , First Publish Date - 2021-01-27T20:48:55+05:30 IST

దేశ రాజధాని ఢిల్లీలో నిన్న జరిగిన అల్లర్లపై కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్‌గా ఉంది.

నిన్నటి ఘటనకు సిద్ధూయే బాధ్యుడు: రైతులు

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో నిన్న జరిగిన అల్లర్లపై కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్‌గా ఉంది. కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఇప్పటికే రివ్యూ నిర్వహించగా హోంమంత్రి అమిత్ షా ఐబీచీఫ్, ఇతర ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. అసలేం జరుగుతోంది? ముందే ఇంటిలిజెన్స్ సమాచారం ఎందుకు రాలేదని నిలదీసినట్లు తెలియవచ్చింది. ఇప్పటికే 35 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేసి.. సుమారు 2 వందల మందిని నిందితులుగా గుర్తించినట్లు సమాచారం. దీనిపై ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ విచారణ చేపట్టనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఢిల్లీలో సమావేశమైన రైతు సంఘాల ప్రతినిధులు నిన్నటి విధ్వంస ఘటనలను ఖండించారు. వాటి వెనుక ఉన్నది సింగర్ బీజేపీ నేత సిద్ధూయేనని ఆరోపించారు. అతనే కొంతమందితో ఎర్రకోటపైకి వెళ్లారని, అల్లర్లను సృష్టించింది కూడా అతనేనని తీవ్ర ఆరోపణలు చేశారు. కాగా నిన్న జరిగిన ఘటనలతో రైతు సంఘాల ప్రతినిధులు త్వరలోనే చేపట్టనున్న పార్లమెంట్ ర్యాలీపై పునరాలోచనలో పడ్డారు. దాన్ని వాయిదా వేసుకోవడం మంచిదనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

Updated Date - 2021-01-27T20:48:55+05:30 IST