ఇటలీలో స్టెప్పులేస్తున్న హీరో రామ్

ABN , First Publish Date - 2020-02-15T21:09:22+05:30 IST

రామ్‌ హీరోగా ‘స్రవంతి’ రవికిశోర్‌ నిర్మిస్తున్న చిత్రం ‘రెడ్‌’. నివేదా పేతురాజ్‌, మాళవికా శర్మ నాయికలు. కిశోర్‌ తిరుమల దర్శకుడు.

ఇటలీలో స్టెప్పులేస్తున్న హీరో రామ్

రామ్‌ హీరోగా ‘స్రవంతి’ రవికిశోర్‌ నిర్మిస్తున్న చిత్రం ‘రెడ్‌’. నివేదా పేతురాజ్‌, మాళవికా శర్మ నాయికలు. కిశోర్‌ తిరుమల దర్శకుడు. కృష్ణ పోతినేని సమర్పకుడు. ప్రస్తుతం ఇటలీలో చిత్రీకరణ జరుగుతోంది. నిర్మాత మాట్లాడుతూ ‘‘నేను... శైలజ’, ‘ఉన్నది ఒకటే జిందగి’ తర్వాత రామ్‌-కిశోర్‌ తిరుమల కలయికలో వస్తున్న మూడో చిత్రమిది. గోవా, హైదరాబాద్‌, వైజాగ్‌ ప్రాంతాల్లో జరిపిన షూటింగ్‌తో టాకీ పూర్తయ్యింది.


ఈ నెల 12 నుంచి ఇటలీలో టస్క్‌, ఫ్లారెన్స్‌, డోలోమైట్స్‌ లాంటి ప్రాంతాల్లో రామ్‌, మాళవికా శర్మలపై శోభి మాస్టర్‌ కొరియోగ్రఫీలో రెండు పాటల్ని చిత్రీకరిస్తున్నాం. ఈ నెల 20 వరకు ఇటలీలో షెడ్యూల్‌ జరుగుతుంది. హైదరాబాద్‌ తిరిగొచ్చాక చిత్రీకరించే పాటతో షూటింగ్‌ మొత్తం పూర్తవుతుంది. మణిశర్మ చక్కని బాణీలు అందిస్తున్నారు. ఆయన మా బ్యానర్‌లో పని చేయడం ఇదే మొదటిసారి. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసి ఏప్రిల్‌ 9న సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు.

Updated Date - 2020-02-15T21:09:22+05:30 IST