ఎర్రచందనం పట్టివేత, స్మగ్లర్‌ అరెస్టు

ABN , First Publish Date - 2021-06-20T04:57:17+05:30 IST

చిత్తూరు జిల్లా రేణిగుంట పరిధిలోని ఆంజనేయపురం చెక్‌పోస్టు చైతన్యపురం వద్ద శనివారం వాహనంలో ఎర్రచందనం దుంగలను తరలిస్తుండగా పట్టుకున్నట్లు రైల్వేకోడూరు టాస్క్‌ఫోర్సు తిరుపతి డీఎస్పీ మురళీధర్‌, ఆర్‌ఐ కృపానంద, ఆర్‌ఎ్‌సఐ లక్ష్మణ్‌ తెలిపారు.

ఎర్రచందనం పట్టివేత, స్మగ్లర్‌ అరెస్టు

రైల్వేకోడూరు, జూన్‌ 19: చిత్తూరు జిల్లా రేణిగుంట పరిధిలోని ఆంజనేయపురం చెక్‌పోస్టు చైతన్యపురం వద్ద శనివారం వాహనంలో ఎర్రచందనం దుంగలను తరలిస్తుండగా పట్టుకున్నట్లు రైల్వేకోడూరు టాస్క్‌ఫోర్సు తిరుపతి డీఎస్పీ మురళీధర్‌, ఆర్‌ఐ కృపానంద, ఆర్‌ఎ్‌సఐ లక్ష్మణ్‌ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టయోటా వాహనం అనుమాస్పదంగా కనిపించడంతో దాడులు చేసి పట్టుకున్నట్లు వివరించారు. అక్రమంగా తరలిస్తున్న 10 ఎర్రచందనం దుంగలను పట్టుకు న్నామన్నారు. కారు డ్రైవర్‌ ఏర్పేడు మండలం అంజిమేడుకు చెందిన స్మగ్లర్‌ వేణుగోపాల్‌ను అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆయన వివరించారు. 

Updated Date - 2021-06-20T04:57:17+05:30 IST