రెడ్ జోన్ ఏరియాల్లో ఇంటి వద్దకే రేషన్..
ABN , First Publish Date - 2020-04-02T16:46:08+05:30 IST
రోనా పాజిటివ్గా వచ్చి రెడ్ జోన్గా..
మహారాణిపేట(విశాఖపట్నం): కరోనా పాజిటివ్గా వచ్చి రెడ్ జోన్గా గుర్తించిన అల్లిపురం, అక్కయ్యపాలెం, ఐటీఐ, ఎన్ఏడీ, పద్మనాభంలోని రేవిడి ప్రాంతాల్లో తెల్ల కార్డుదారుల ఇళ్లకు వెళ్లి రేషన్ సరుకులు ఇవ్వాలని పౌరసరఫరాల శాఖ అధికారులను జేసీ ఎల్.శివశంకర్ ఆదేశించారు. బుధవారం ఆయన మండల స్థాయి అధికారులతో రేషన్ సరుకుల పంపిణీ, నిత్యావసర సరుకుల సరఫరా, తాత్కాలిక రైతుబజార్ల ఏర్పాట్లుపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతీ రేషన్ డిపోను నిర్దేశించిన సమయం ఉదయం ఆరు గంటలకే తెరవాలని, ఆ విధంగా తెరవకపోతే సంబంధిత అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలని ఆదేశించారు. తాత్కాలిక రైతుబజార్లను ఎక్కువగా ఏర్పాటు చేయాలన్నారు.
96 శాతం కరోనా స్పందన సమస్యలు పరిష్కారం
కోవిడ్ స్పందన ద్వారా మొత్తం 285 ఫిర్యాదులను స్వీకరించి, అందులో 276 సమస్యలను పరిష్కరించామని జేసీ శివశంకర్ తెలిపారు. కంట్రోల్ రూమ్కు ఫోన్ కాల్స్ ద్వారా వచ్చిన సమస్యలను 96 శాతం పరిష్కరించామన్నారు.