బీసీలపై వైసీపీది సవతి తల్లి ప్రేమ: రెడ్డెప్ప

ABN , First Publish Date - 2021-02-25T09:30:37+05:30 IST

బీసీల పట్ల వైసీపీ ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపుతోందని జాతీయ బీసీ జేఏసీ కన్వీనర్‌ వలిగట్ల రెడ్డెప్ప అన్నారు. సంక్షేమ శాఖల్లో ఉన్న అరకొర నిధులను కూడా నవరత్నాలకు మళ్లించడం సరికాదన్నారు

బీసీలపై వైసీపీది సవతి తల్లి ప్రేమ: రెడ్డెప్ప

అమరావతి, ఫిబ్రవరి 24(ఆంధ్రజ్యోతి): బీసీల పట్ల వైసీపీ ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపుతోందని జాతీయ బీసీ జేఏసీ కన్వీనర్‌ వలిగట్ల రెడ్డెప్ప అన్నారు. సంక్షేమ శాఖల్లో ఉన్న అరకొర నిధులను కూడా నవరత్నాలకు మళ్లించడం సరికాదన్నారు. కార్పొరేషన్ల ద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను మభ్యపెట్టే విధంగా ప్రభుత్వం ప్రకటనలు ఇవ్వడం హాస్యాస్పదమన్నారు. బీసీ కులాల కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఇన్ని రోజులైనా వాటికి రూపాయి కూడా కేటాయించలేదని విమర్శించారు. జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు కావస్తున్నా ఒక్క బీసీ వ్యక్తికైనా రుణం ఇచ్చిన పాపాన పోలేదన్నారు. 

Updated Date - 2021-02-25T09:30:37+05:30 IST