దరలను తగ్గించాలి : వామపక్ష నాయకులు

ABN , First Publish Date - 2021-06-20T06:37:05+05:30 IST

దేశవ్యాప్తంగా రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలను నిరసిస్తూ శనివారం జిల్లా కలెక్టరేట్‌ ఎదుట వామపక్షాల నాయకులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ ప్రభుత్వ తీరుకు నిరసనగా వ్యతిరేక నినాదాలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ దేశంలో ఇందన ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతూనే ఉన్నాయన్నారు. ఇప్పటికే భారీగా

దరలను తగ్గించాలి : వామపక్ష నాయకులు
కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేస్తున్న వామపక్షాల నాయకులుఽ

ఆదిలాబాద్‌ టౌన్‌, జూన్‌ 19: దేశవ్యాప్తంగా రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలను నిరసిస్తూ శనివారం జిల్లా కలెక్టరేట్‌ ఎదుట వామపక్షాల నాయకులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ ప్రభుత్వ తీరుకు నిరసనగా వ్యతిరేక నినాదాలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ దేశంలో ఇందన ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతూనే ఉన్నాయన్నారు. ఇప్పటికే భారీగా పెరిగిన చమురుధరలతో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశానంటుతున్నాయన్నారు. లీటర్‌ పెట్రోల్‌పై 20పైసలు, లీటర్‌ డీజిల్‌పై 16 పైసల వరకు పెంచాయని ఆరోపించారు. దేశంలోని చాలా రాష్ట్రంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు చేరుకున్నాయన్నారు. మే 4నుంచి ఇప్పటి వరకు 26సార్లు చము రు ధరలు పెరిగాయన్నారు. పెట్రోల్‌పై రూ.6.34, డీజిల్‌ రూ.6.63 వరకు పెంచాయని ఆరోపించారు. పెరిగిన చమురు ధరలను తగ్గించాల్సిన అవసరం ఉందని డిమాండ్‌ చేశారు. లేనియెడల వామపక్షాల ఆధ్వర్యంలో తీవ్ర ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ముడుపు ప్రభాకర్‌రెడ్డి, లంక రాఘవులు, బండిదత్తాత్రి, అరుణ్‌కుమార్‌, కుంటాల రాములు, తదితరులున్నారు. 

Updated Date - 2021-06-20T06:37:05+05:30 IST