యాదాద్రి క్షేత్రానికి తగ్గిన భక్తుల రద్దీ

ABN , First Publish Date - 2022-01-24T05:57:58+05:30 IST

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో భక్తుల రద్దీ తగ్గింది. ఆదివారం సెలవురోజు కావడంతో సాధారణంగా ఆలయం ప్రాంగణంతోపాటు బాలాలయం భక్తులతో కిటకిటలాడుతూ ఉండేది. అయితే కరోనా రోజురోజు కూ విజృంభిస్తుండటంతో భక్తుల సందడి అంత గా కనిపించలేదు.

యాదాద్రి క్షేత్రానికి తగ్గిన భక్తుల రద్దీ
బాలాలయంలో స్వామివారి నిత్యకల్యాణం నిర్వహిస్తున్న అర్చకులు

కరోనా ప్రభావంతో కనిపించని సందడి

తగ్గిన యాదాద్రీశుడి ఆదాయం 


యాదాద్రి, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో భక్తుల రద్దీ తగ్గింది. ఆదివారం సెలవురోజు కావడంతో సాధారణంగా ఆలయం ప్రాంగణంతోపాటు బాలాలయం భక్తులతో కిటకిటలాడుతూ ఉండేది. అయితే కరోనా రోజురోజు కూ విజృంభిస్తుండటంతో భక్తుల సందడి అంత గా కనిపించలేదు.ఆలయ తీరువీధులు, కొండపై ప్రాంతాలు బోసిపోయాయి. కరోనా విజృంభణకు ముందు ఆదివారం 30వేలనుంచి 35వేల మంది భక్తులు హాజరుకాగా, కరోనా భయంతో ఆదివా రం రోజు 15వేల లోపు భక్తులు వచ్చినట్లు తెలుస్తోంది. అదేవిధంగా సాధారణంగా ఆలయ ఖజానాకు రూ.25లక్షలనుంచి రూ.30లక్షలవరకు ఆదా యం సమకూరగా, ఆదివారం మాత్రం రూ.13.11లక్షల ఆదాయం మాత్రమే వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే బాలాలయంలో కవచమూర్తులను దర్శించుకుని సువర్ణ పుష్పార్చన పూజల్లో పాల్గొన్న భక్తులు కుటుంబసమేతంగా పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామికి నిత్య పూజా కైంకర్యాలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. వేకువజామున సుప్రభాతంతో నిత్యారాధనలు ఆరంభించారు. ఉత్సవమూర్తులను పంచామృతాల తో అభిషేకించి తులసీదళాలతో అర్చించారు. అనంతరం ఉత్సవమూర్తులకు అభిషేకం, అర్చనలు,హోమం నిత్యతిరుకల్యాణపర్వాలు సంప్రదాయరీతిలో కొనసాగాయి. పాతగుట్ట ఆలయంలో స్వయంభువులను దర్శించుకున్న భక్తులు ఆర్జిత సేవోత్సవాల్లో పాల్గొన్నారు.

Updated Date - 2022-01-24T05:57:58+05:30 IST