కాళేశ్వరంతో పల్లెల్లో జలకళ

ABN , First Publish Date - 2020-05-02T10:06:04+05:30 IST

కాళ్లేశ్వరం నీటితో పల్లెలో జలకళ సంతరించుకుందని డోర్నకల్‌ ఎమ్మెల్యే డీఎస్‌. రెడ్యానాయక్‌ అన్నారు.

కాళేశ్వరంతో పల్లెల్లో జలకళ

చిన్నగూడూరు, మే 1:  కాళ్లేశ్వరం నీటితో పల్లెలో జలకళ సంతరించుకుందని డోర్నకల్‌ ఎమ్మెల్యే డీఎస్‌. రెడ్యానాయక్‌ అన్నారు. శుక్రవారం మండలంలోని చిన్నగూడూరు, జయ్యారం, ఉగ్గంపల్లి, గుండంరాజుపల్లి గ్రామాల్లో ఆయన పీఎ్‌ససీఎస్‌, ఐకేపీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ధాన్యం కోనుగోలు కేంద్రాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ  కోనుగోలు కేంద్రాల్లో గన్నీ బ్యాగులు, టార్ఫలిన్ల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.


కార్యక్రమంలో ఎంపీపీ వల్లూరి పద్మావెంకటరెడ్డి, జడ్పీటీసీ మూల సునీతామురళీధర్‌ రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ చాపల యాదగిరి రెడ్డి, రైతు సమన్వయ సమతి మండల కన్వీనర్‌ సంకినేతి మంతిపతిరావు, చెన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలాగే ప్రపంచ కార్మికుల దినోత్సవం పురస్కరించుకుని మండలంలోని ఉగ్గంపల్లి గ్రామంలో ఎమ్మెల్యే డీఎ్‌స.రెడ్యానాయక్‌  జెండా అవిష్కరణ చేశారు 

Updated Date - 2020-05-02T10:06:04+05:30 IST