TS News: కేంద్ర మంత్రి చావు కబురు చల్లగా చెప్పారు: రెడ్యానాయక్

ABN , First Publish Date - 2022-09-27T21:01:26+05:30 IST

బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వడం సాధ్యం కాదని కేంద్ర మంత్రి చావు కబురు చల్లగా చెప్పారని ఎమ్మేల్యే రెడ్యానాయక్ అన్నారు.

TS News: కేంద్ర మంత్రి చావు కబురు చల్లగా చెప్పారు: రెడ్యానాయక్

హైదరాబాద్ (Hyderabad): బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వడం సాధ్యం కాదని కేంద్ర మంత్రి చావు కబురు చల్లగా చెప్పారని ఎమ్మేల్యే రెడ్యానాయక్ (Redyanaik) అన్నారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఇక్కడి హక్కులు కాపాడాల్సిన బాధ్యత బీజేపీ (BJP)కి లేదా? అని ప్రశ్నించారు. బాధ్యత లేని బీజేపీ నేతలకు ఈ ప్రాంతానికి వచ్చే హక్కు ఎక్కడిదన్నారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఇస్తామని విభజన చట్టంలో చెప్పారన్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy)కి కనీసం బాధ్యత లేదా? అని అన్నారు. ఏ మొహం పెట్టుకుని వచ్చి ఇక్కడ ఓట్లు అడుగుతారు... బీజేపీ మోసాలు ప్రజలకు తెలవదా? అన్నారు. బండి సంజయ్‌కు సంస్కారం ఉందా?.. ఏం మాట్లాడతారో తెలియదన్నారు. సీఎం కేసీఆర్‌కు దేశ వ్యాప్తంగా మంచి పేరు వస్తుందని బీజేపీకి ఈర్ష్యగా ఉందని రెడ్యానాయక్ అన్నారు. 

Updated Date - 2022-09-27T21:01:26+05:30 IST