నాగావళి తీరంలో సందడి
ABN , First Publish Date - 2021-01-16T05:19:02+05:30 IST
దీ తీరంలోన్న రేగాలమ్మ కొండకు శుక్రవారం భక్తులు పోటెత్తారు. కనుము పురస్కరించుకుని పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఒకవైపు రాళ్ల గుట్టలు, మరోవైపు నాగావళి నదీ తీరం ఉండడం ఇక్కడి ప్ర
గరుగుబిల్లి : నాగావళి నదీ తీరంలోన్న రేగాలమ్మ కొండకు శుక్రవారం భక్తులు పోటెత్తారు. కనుము పురస్కరించుకుని పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఒకవైపు రాళ్ల గుట్టలు, మరోవైపు నాగావళి నదీ తీరం ఉండడం ఇక్కడి ప్రత్యేకత. యువత, చిన్నారులు పెద్దఎత్తున హాజరయ్యారు. గుట్టల వద్ద సందడిగా గడిపారు. ఎటువంటి ప్రమాదాలు జరగకుండా గరుగుబిల్లి ఎస్ఐ వై.సింహాచలం, ఏఎస్ఐ పి.రాంబాబుల ఆధ్వర్యంలో సిబ్బంది ప్రత్యేక చర్యలు చేపట్టారు.