సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో భారీ కుంభకోణం

ABN , First Publish Date - 2021-08-11T01:26:42+05:30 IST

కృష్ణా : జిల్లాలోని మండవల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో భారీ కుంభకోణం బయటపడింది. నకిలీ చలానాలతో రూ.75లక్షల మేర అవినీతి జరిగినట్లు తెలుస్తోంది.

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో భారీ కుంభకోణం

కృష్ణా : జిల్లాలోని మండవల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో భారీ కుంభకోణం బయటపడింది. నకిలీ చలానాలతో రూ.75లక్షల మేర అవినీతి జరిగినట్లు తెలుస్తోంది. చలానాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం సీఎఫ్ఎంఎస్ పద్ధతిని తీసుకొచ్చింది. ఈ క్రమంలో జిల్లా అధికారులు సంబంధిత రికార్డులను తనిఖీ చేస్తుండగా కుంభకోణం బయటపడింది. కొందరు అధికారుల ప్రమేయంతోనే ఇదంతా జరిగినట్లు సమాచారం. ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడిందని.. ఉన్నతాధికారులకు నివేదిక అందించామని సబ్ రిజిస్ట్రార్ కేవీఎస్ఎన్ సుబ్రహ్మణ్యం తెలిపారు.

Updated Date - 2021-08-11T01:26:42+05:30 IST