కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను పర్మనెంట్‌ చేయాలి

ABN , First Publish Date - 2022-01-22T06:29:47+05:30 IST

కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను పర్మనెంట్‌ చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆర్‌.శంకరరావు డిమాండ్‌ చేశారు.

కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను పర్మనెంట్‌ చేయాలి
ధర్నా చేస్తున్న కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు

సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆర్‌.శంకరరావు డిమాండ్‌ 


పాడేరు, జనవరి 21: కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను పర్మనెంట్‌ చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆర్‌.శంకరరావు డిమాండ్‌ చేశారు. శుక్రవారం ఐటీడీఏ కార్యాలయం ముందు ఉద్యోగులు చేపట్టిన ధర్నాలో ఆయన మాట్లాడుతూ, తాము అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను పర్మనెంట్‌ చేస్తామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని జగన్మోహన్‌రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు, ఎన్నికల ప్రచారం సమయంలో హామీ ఇచ్చారని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావస్తున్నా ఒక్క హామీని కూడా నెరవేర్చలేదన్నారు. తాజాగా విడుదల చేసిన పీఆర్‌సీ జీవోలతో కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు ఎటువంటి మేలు జరిగే పరిస్థితి లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ సంఘాల నేతలు నాగరాజు, లక్ష్మణరావు, కొండలరావు, బాలన్న, సుందరరావు, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-01-22T06:29:47+05:30 IST