బాలింత అదృశ్యంపై బంధువుల ఆందోళన

ABN , First Publish Date - 2020-09-19T05:30:00+05:30 IST

పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి నుంచి మా నస అనే బాలింత అ దృశ్యం అ వ డంతో శుక్రవారం ఆమె బంధువులు ఆస్పత్రి ఎదుట

బాలింత అదృశ్యంపై బంధువుల ఆందోళన

చెన్నూరు, సెప్టెంబరు 18:  పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి నుంచి మా నస అనే బాలింత  అ దృశ్యం అ వ డంతో శుక్రవారం ఆమె బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఐదు రోజుల క్రితం మానస బిడ్డకు జన్మచింది. కాగా గురు వారం ఆమె ఆస్పత్రి నుంచి అదృశ్యమైంది. సిబ్బంది నిర్లక్ష్యం మూలంగానే మానస ఆస్పత్రి నుంచి అదృశ్యమైందని భర్త రమేష్‌తో పాటు బంధువులు ఆందోళనకు దిగారు. సర్జరీ సమయంలో మానసకు మత్తు మందు ఇవ్వడం మూలంగానే ఆమెకు వింతగా మాట్లాడిందని బంధువులు తెలిపారు. దీనికి ఆస్పపత్రి యాజమాన్యమే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. విషయం తెలుసుకున్న సీఐ ప్రమోద్‌రావు సంఘటన స్థలానికి చేరుకుని వారికి నచ్చజెప్పి ఆందోళ న విరమింపజేశారు. 

Updated Date - 2020-09-19T05:30:00+05:30 IST