chennai: మాకు నష్టం చేకూర్చొద్దు...

ABN , First Publish Date - 2021-10-13T13:17:23+05:30 IST

రైతులకు నష్టం కలిగేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పథకాలు ప్రవేశపెట్టరాదంటూ తిరుచ్చిలో రైతులు 46 రోజుల రిలే నిరాహారదీక్షను మంగళవారం ప్రారంభించారు. జాతీయ దక్షిణ భారత నదుల అనుసంధానం రైతుల సం

chennai: మాకు నష్టం చేకూర్చొద్దు...

                         - తిరుచ్చిలో రైతుల రిలే నిరాహారదీక్ష


ప్యారీస్‌(చెన్నై): రైతులకు నష్టం కలిగేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పథకాలు ప్రవేశపెట్టరాదంటూ తిరుచ్చిలో రైతులు 46 రోజుల రిలే నిరాహారదీక్షను మంగళవారం ప్రారంభించారు. జాతీయ దక్షిణ భారత నదుల అనుసంధానం రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాకన్ను నేతృత్వంలో తిరుచ్చి -కరూర్‌ బైపాస్‌ రోడ్డులో మొత్తం 46 రోజులు ఈ దీక్షా పోరాటం కొనసాగనుంది. లక్కింపూర్‌ సంఘటనకు బాధ్యులైన నిందితులకు ఉరిశిక్ష విధించాలని, కేంద్రప్రభుత్వం కొత్త వ్యవసాయ సాగు చట్టాలు ఉపసంహ రించుకోవాలని, రైతుల దిగుబడులకు రెండింతల గిట్టుబాటు ధర కల్పించాలని. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు సరఫరా చేసిన వరి ధాన్యానికి అప్పటికప్పుడు కొనుగోలు ధర పంపిణి చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్‌ చేస్తూ రోజుకు 15 మంది రైతులు నిరాహారదీక్షలో పాల్గొంటారని అయ్యాకన్ను తెలిపారు.

Updated Date - 2021-10-13T13:17:23+05:30 IST