ఏపీ పీజీఈసెట్ ఫలితాల విడుదల
ABN , First Publish Date - 2021-10-21T07:10:13+05:30 IST
ఏపీపీజీఈసెట్ ఫలితాలను బుధవారం ఎస్వీయూ వీసీ రాజారెడ్డి విడుదల చేశారు.
తిరుపతి (విశ్వవిద్యాలయాలు), అక్టోబరు 20: ఏపీపీజీఈసెట్ ఫలితాలను బుధవారం ఎస్వీయూ వీసీ రాజారెడ్డి విడుదల చేశారు. ఎనిమిది వేల మంది పరీక్ష రాయగా, 7300 మంది అర్హత సాధించారు. ఉత్తీర్ణులైన వారు.. ‘ఎస్సీహెచ్ఈ-ఏపీ’ వెబ్ సైట్ నుంచి ర్యాంకు కార్డులు డౌన్లోడ్ చేసుకోవచ్చని కన్వీనర్ సత్యనారాయణ తెలిపారు.