రేపు కాల్వలకు నీటి విడుదల
ABN , First Publish Date - 2021-06-14T05:39:41+05:30 IST
పశ్చిమ డెల్టా కాలువలకు సాగు, తాగు నీటిని ఈ నెల 15వ తేదీ ఉద యం విడుదల చేస్తున్నామని నీటి పారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దక్షిణామూర్తి తెలిపారు.
నిడదవోలు, జూన్ 13: పశ్చిమ డెల్టా కాలువలకు సాగు, తాగు నీటిని ఈ నెల 15వ తేదీ ఉద యం విడుదల చేస్తున్నామని నీటి పారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దక్షిణామూర్తి తెలిపారు. ఈ నెల 15వ తేదీ ఉదయం విజ్జేశ్వ రం బ్యారేజీ వద్ద నీటి పారుదల శాఖ ఉన్నతాధికా రులు, ప్రజాప్ర తినిధుల సమక్షంలో గోదావరి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి నీటిని విడుదల చేయనున్నట్టు తెలిపారు. ఇప్పటి వరకు తాగునీటి సమస్య ఉన్న నరసాపురం, ఉండి, కాలువలకు తాగునీటిని అందిస్తూ వచ్చామని 15వ తేదీ నుంచి జిల్లా మొత్తానికి సాగు, తాగు నీరు అందు బాటులోకి వస్తుందన్నారు.