కత్తితో తిరుగుతున్న వ్యక్తికి రిమాండ్
ABN , First Publish Date - 2021-04-16T06:54:53+05:30 IST
కత్తితో తిరుగుతున్న వ్యక్తిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు.
బంజారాహిల్స్, ఏప్రిల్ 15 (ఆంధ్రజ్యోతి):కత్తితో తిరుగుతున్న వ్యక్తిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఎస్ఐ ఉదయ్ సిబ్బందితో బుధవారం రాత్రి బంజారాహిల్స్ రోడ్డు నెంబరు 10 జహీరానగర్ చౌరస్తాలో వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఓ ఆటో అనుమానాస్పదంగా కనిపించింది. పోలీసులు అందులో ఉన్న వ్యక్తిని తనిఖీ చేయగా డాగర్ లభించింది. అతడు చాంద్రాయణగుట్ట పూల్బాగ్కు చెందిన మహ్మద్ ఇబ్రహీంగా గుర్తించారు. ఆయుధాన్ని స్వాధీనం చేసుకొని ఇబ్రహీంను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు.