ప్రొటొకాల్ నుంచి ‘ప్లాస్మా థెరపీ’ తొలగింపు
ABN , First Publish Date - 2021-05-18T07:30:05+05:30 IST
వయోజన కరోనా రోగుల చికిత్సకు సంబంధించిన క్లినికల్ ప్రొటొకాల్లో కేంద్ర ప్రభుత్వం సోమవారం కీలక మార్పు చేసింది
న్యూఢిల్లీ, మే 17 : వయోజన కరోనా రోగుల చికిత్సకు సంబంధించిన క్లినికల్ ప్రొటొకాల్లో కేంద్ర ప్రభుత్వం సోమవారం కీలక మార్పు చేసింది. కొవిడ్-19 చికిత్సా పద్ధతుల జాబితా నుంచి కన్వల్సెంట్ ప్లాస్మా థెరపీని తొలగించినట్లు భారత వైద్య పరిశోధనా మండలి వెల్లడించింది. ‘ఆఫ్-లేబుల్’ ప్రాతిపదికన కరోనా చికిత్సకు ఈ పద్ధతిని వినియోగించవచ్చంటూ గతంలో తాము జారీచేసిన మార్గదర్శకాలను ఉపసంహరించుకున్నట్లు తెలిపింది.