ఎఫ్బీ, ఇన్స్టాగ్రామ్ నుంచి రెండో కోట్ల పోస్టుల తొలగింపు
ABN , First Publish Date - 2021-08-21T08:22:15+05:30 IST
కొవిడ్ 19పై తప్పుదోవ పట్టించే సమాచారంతో కూడిన రెండు కోట్ల మేరకు
కొవిడ్ 19పై తప్పుదోవ పట్టించే సమాచారంతో కూడిన రెండు కోట్ల మేరకు పోస్టులను ‘ఫేస్బుక్’ తొలగించింది. మెయిన్ సోషల్ నెట్వర్క్కు తోడు ఫొటో షేరింగ్ యాప్ ‘ఇన్స్టాగ్రామ్’ నుంచి ఈ తొలగింపునకు చర్యలు తీసుకుంది. ఈ క్రమంలోనే పదేపదే తప్పుడు పనులకు పాల్పడుతున్న వారిని ఎఫ్బీ నుంచి నిషేధించింది. క్వార్టర్లీ రిపోర్ట్ను కూడా తీసుకురానున్నట్టు ప్రకటించింది. ఎక్కువ మంది చూసిన పబ్లిక్ పోస్టుల వివరాలను అందులో ఉంచనుంది. ఎఫ్బీలో చూసిన పాపులర్ ఎక్స్టర్నల్ వెబ్ డొమైన్స్, యూట్యూబ్ టాపింగ్ లిస్ట్, అలాగే అమెజాన్ జాబితా కూడా ఆ నివేదికలో పొందుపరుస్తారు.