తెలుగు తల్లి విగ్రహం, పూర్ణకుంభం తొలగింపు

ABN , First Publish Date - 2021-06-19T06:14:53+05:30 IST

తిరుపతికొచ్చే యాత్రికులకు నగర ముఖద్వారంలో కనువిందు చేస్తుండిన పూర్ణకుంభం, తెలుగుతల్లి విగ్రహాన్ని గరుడ వారధి నిర్మాణంలో తొలగించాల్సి వచ్చింది.

తెలుగు తల్లి విగ్రహం, పూర్ణకుంభం తొలగింపు

తిరుపతి(కొర్లగుంట), జూన్‌ 18: తిరుపతికొచ్చే యాత్రికులకు నగర ముఖద్వారంలో కనువిందు చేస్తుండిన పూర్ణకుంభం, తెలుగుతల్లి విగ్రహాన్ని గరుడ వారధి నిర్మాణంలో తొలగించాల్సి వచ్చింది. ఈ ప్రదేశంలో వలయాకారంలో వంతెన రూపుదిద్దుకోనుంది. దీనికోసం విరివిగా పిల్లర్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఇవి రెండూ నిర్మాణాలకు అడ్డంకిగా ఉన్నాయని ఇంజనీరింగ్‌ నిపుణులు గుర్తించారు. ఈ క్రమంలో గురువారం రాత్రి ట్రాఫిక్‌ లేని సమయంలో పూర్ణకుంభం, తెలుగుతల్లి విగ్రహాలను జాగ్రత్తగా తొలగించి, భద్రపరిచారు.  

Updated Date - 2021-06-19T06:14:53+05:30 IST