ఆ ముగ్గుర్నీ కూడా తీసేయండి

ABN , First Publish Date - 2021-01-17T07:44:12+05:30 IST

మూడు సాగుచట్టాలపై చర్చ నిమిత్తం ఏర్పాటు చేసిన నిపుణుల బృందంలో మిగిలిన ముగ్గురినీ కూడా తొలగించాలని కోరుతూ భారతీయ

ఆ ముగ్గుర్నీ కూడా తీసేయండి

సుప్రీంలో రైతు సంఘం అఫిడవిట్‌


న్యూఢిల్లీ, జనవరి 16: మూడు సాగుచట్టాలపై చర్చ నిమిత్తం ఏర్పాటు చేసిన నిపుణుల బృందంలో మిగిలిన ముగ్గురినీ కూడా తొలగించాలని కోరుతూ భారతీయ కిసాన్‌ యూనియన్‌ (లోక్‌శక్తి) సుప్రీంకోర్టులో ఓ అఫిడవిట్‌ దాఖలు చేసింది. నలుగురితో సుప్రీంకోర్టు ఓ కమిటీ వేయగా భూపిందర్‌సింగ్‌ మాన్‌ అనే రైతుసంఘం నేత దాన్నుంచి వైదొలిగారు.


‘‘ఆ నలుగురూ సాగు చట్టాలను సమర్థించిన వారు. వారితో చర్చలు జరిపి ఏం ప్రయోజనం? వారిలో ఒకరు ఎటూ వైదొలిగారు. మిగిలిన ముగ్గురినీ కూడా తీసేసి-  నిష్పక్షపాతమైన వ్యక్తులతో కూడిన వేరే కమిటీని వేయండి’ అని బీకేయూ-లోక్‌శక్తి ఆ అఫిడవిట్‌లో కోరింది. కాగా- సాగు చట్టాల విషయంలో ప్రభుత్వం ఎవరినీ సంప్రదించలేదని, అందుచేత వాటిని రద్దు చేయాల్సిందేనని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పి చిదంబరం డిమాండ్‌ చేశారు.


Updated Date - 2021-01-17T07:44:12+05:30 IST