మార్కెట్లోకి రెనో ‘కైగర్‌’

ABN , First Publish Date - 2020-11-21T07:50:05+05:30 IST

రెనో కంపెనీ కొత్త కారు కైగర్‌’ను విడుదల చేసింది. భారత్‌ నుంచి ప్రపంచ మార్కెట్‌లోకి దీన్ని ప్రవేశపెట్టనున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఫ్రాన్స్‌లోని కార్పొరేట్‌ డిజైన్‌ బృందాలతో కలిసి కైగర్‌ను రెనో

మార్కెట్లోకి రెనో ‘కైగర్‌’

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): రెనో కంపెనీ కొత్త కారు కైగర్‌’ను విడుదల చేసింది. భారత్‌ నుంచి ప్రపంచ  మార్కెట్‌లోకి దీన్ని  ప్రవేశపెట్టనున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఫ్రాన్స్‌లోని కార్పొరేట్‌ డిజైన్‌ బృందాలతో కలిసి కైగర్‌ను రెనో ఇండియా అభివృద్ధి చేసింది. సరికొత్త టర్బో పెట్రోల్‌ ఇంజిన్‌తో కైగర్‌ను కంపెనీ ప్రవేశపెట్టింది. బ్రాండ్‌ న్యూ ఇంజిన్‌ ఇంధన ఆదాతోపాటు పికప్‌ మొదలైనవన్నీ మెరుగ్గా ఉంటాయని  రెనో ఇండియా సీఈఓ, మేనేజింగ్‌ డైరెక్టర్‌ వేంకట్రామ్‌ మామిళ్లపల్లి తెలిపారు. క్విడ్‌, ట్రైబర్‌ తర్వాత ముందుగా భారత్‌ మార్కెట్‌లోకి విడుదల చేసిన కారు ఇదే. 

Updated Date - 2020-11-21T07:50:05+05:30 IST