నేటి నుంచి జూట్ మిల్లుల పునః ప్రారంభం
ABN , First Publish Date - 2020-05-28T16:26:42+05:30 IST
నేటి నుంచి జూట్ మిల్లుల పునః ప్రారంభం
ఏలూరు: లాక్డౌన్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ జీవో ప్రకారం లాక్డౌన్ కాలానికి కార్మికులకు వేతనాలు ఇవ్వాలని తదితర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కొద్ది రోజులుగా ఏలూరు, కొత్తూరు జూట్ మిల్లుల కార్మికులు చేస్తున్న ఆందోళనకు తెర పడింది. జూట్ యాజమాన్యం, ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని ప్రతినిధులు కార్మిక సంఘాల నాయకులతో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించారు. దీంతో గురువారం నుంచి జూట్ మిల్లులు పునః ప్రారంభించేందుకు మార్గం సుగమం అయింది. కాగా గురువారం ఉదయం 6 గంటలకు ఏలూరు జూట్మిల్లు వద్ద, సాయంత్రం 6 గంటలకు కొత్తూరు జూట్మిల్లు వద్ద గేట్ మీటింగ్లు ఏర్పాటు చేయాలని కార్మిక సంఘాల నాయకులు నిర్ణయించారు.