గుంతల రోడ్డుకు మరమ్మతులు

ABN , First Publish Date - 2021-10-28T04:32:14+05:30 IST

మండలంలోని పులిపాడు సమీపంలో అద్దంకి - దర్శి ప్రధాన రహదారి గోతులమయమైంది. దీంతో నిత్యం వాహన చోదకులు ఇబ్బందులతో పాటు ప్రమాదాలకు గురవుతున్నారు. దీనిపై ఇటీవల ఆంధ్రజ్యోతిలో ‘రోడ్డంతా గోతులు...రోజూ ప్రమాదాలు’ అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. దీంతో పులిపాడు గ్రామ సర్పంచ్‌ ముక్కమళ్ళ శ్రీనివాసరెడ్డి స్పందించారు. ఆర్‌అండ్‌బీ పరిధిలో ఉన్నా వాహన చోదకుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఎక్స్‌కవేటర్‌తో గుంతలను పూడ్చటమే కాక స్వయంగా సర్పంచే గుంతలను పూడ్చటం విశేషం.

గుంతల రోడ్డుకు మరమ్మతులు
గుంతలు పడిన రోడ్డును మట్టితో పూడుస్తున్న సర్పంచ్‌ ఎం. శ్రీనివాసరెడ్డి

ఆంధ్రజ్యోతి కథనానికి స్పందన 

పులిపాడు సర్పంచ్‌ను అభినందించిన వాహన చోదకులు 

ముండ్లమూరు, అక్టోబరు 27 : మండలంలోని పులిపాడు సమీపంలో అద్దంకి - దర్శి ప్రధాన రహదారి గోతులమయమైంది. దీంతో నిత్యం వాహన చోదకులు ఇబ్బందులతో  పాటు ప్రమాదాలకు గురవుతున్నారు.  దీనిపై ఇటీవల ఆంధ్రజ్యోతిలో ‘రోడ్డంతా గోతులు...రోజూ ప్రమాదాలు’ అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. దీంతో పులిపాడు గ్రామ సర్పంచ్‌ ముక్కమళ్ళ శ్రీనివాసరెడ్డి స్పందించారు. ఆర్‌అండ్‌బీ పరిధిలో ఉన్నా వాహన చోదకుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఎక్స్‌కవేటర్‌తో గుంతలను పూడ్చటమే కాక స్వయంగా సర్పంచే గుంతలను పూడ్చటం విశేషం.  ఆర్‌అండ్‌బీ రహదారి పై గోతులను పూడ్చి ప్రయాణం సాఫీగా సాగేటట్లు చేయటంతో వాహన చోదకులు   సర్పంచ్‌ శ్రీనివాసరెడ్డికి, పంచాయతీ కార్యదర్శి కే రాజరాజేశ్వరికి అభినందనలు తెలిపారు. 

 

Updated Date - 2021-10-28T04:32:14+05:30 IST