అత్యాచారయత్నం కేసులో నిందితుడి అరెస్టు
ABN , First Publish Date - 2020-12-03T04:47:02+05:30 IST
మండలంలోని మిట్టమీదపల్లె దళితవాడకు చెందిన ఓ మహిళపై అత్యాచారయత్నం చేసిన నాగినేని సుబ్రహ్మ ణ్యం అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ శివభాస్కర్రెడ్డి తెలిపారు.
రాజంపేట టౌన్, డిసెంబరు2 : మండలంలోని మిట్టమీదపల్లె దళితవాడకు చెందిన ఓ మహిళపై అత్యాచారయత్నం చేసిన నాగినేని సుబ్రహ్మ ణ్యం అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ శివభాస్కర్రెడ్డి తెలిపారు. మన్నూరు పోలీ్సస్టేషన్లో బుధవారం విలేకర్ల సమావేశంలో ఆయన వివరాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిట్టమీదపల్లె దళితవాడకు చెందిన మహిళ సమీప కంపచెట్లలోకి బహిర్భూమికి వెళ్లి వస్తుండగా అదే గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం అలియాస్ మణి అనే వ్యక్తి అత్యాచారయత్నం చేయగా ఆమె తప్పించుకొని ఇంటికి చేరిందన్నారు. అయినా తనకు లొంగకపోతే చంపుతానని కులం పేరుతో మణి తిట్టి బెదిరించిన ట్లు ఈ నెల 30వ తేదీ ఆమె మన్నూరు పోలీ్సస్టేషన్లో ఫిర్యాదు చేసిందన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి నిందితుడు సుబ్రహ్మణ్యంను అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో మన్నూరు సీఐ సురేందర్రెడ్డి, ఎస్ఐ రోషన్ పాల్గొన్నారు.