చేనేత బోర్డు స్థానంలో.. మెరుగైన సంస్థను ఏర్పాటు చేయండి
ABN , First Publish Date - 2020-08-15T10:24:46+05:30 IST
కేంద్రం రద్దు చేసిన చేనేత బోర్డు స్థానంలో స్వయం ప్రతిపత్తి కలిగిన మెరుగైన సంస్థను ఏర్పాటు ..
బండి సంజయ్కి పద్మశాలి యువజన సంఘం వినతి
హైదరాబాద్, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): కేంద్రం రద్దు చేసిన చేనేత బోర్డు స్థానంలో స్వయం ప్రతిపత్తి కలిగిన మెరుగైన సంస్థను ఏర్పాటు చేయాలని పద్మశాలి యువజన సంఘం ప్రతినిధులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ని కోరారు. సంఘం జాతీయ అధ్యక్షుడు గుండేటి శ్రీధర్, రాష్ట్ర అధ్యక్షుడు అవ్వారి భాస్కర్ తదితరులు శుక్రవారం సంజయ్కి వినతిపత్రం అందజేశారు. హైదరాబాద్లోని జాతీయ చేనేత అభివృద్ధి సంస్థ స్థాయిని తగ్గించడం శోచనీయమన్నారు. కాగా, తమ సమస్యను కేంద్ర జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు ప్రయత్నిస్తానని సంజయ్ హామీ ఇచ్చారని యువజన సంఘం ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు.