బుధవారం టీటీడీ డిగ్రీ కాలేజీల్లో యాజమాన్య కోటా సీట్ల భర్తీ

ABN , First Publish Date - 2022-01-18T23:14:33+05:30 IST

టీటీడీ ఉద్యోగుల పిల్లలకు, బాలమందిరంలో చదువుకున్న విద్యార్థులకు టీటీడీ డిగ్రీ కళాశాలల్లో ప్రత్యేకంగా యాజమాన్య కోటా కింద

బుధవారం టీటీడీ డిగ్రీ కాలేజీల్లో యాజమాన్య కోటా సీట్ల భర్తీ

తిరుపతి, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): టీటీడీ ఉద్యోగుల పిల్లలకు, బాలమందిరంలో చదువుకున్న విద్యార్థులకు టీటీడీ డిగ్రీ కళాశాలల్లో ప్రత్యేకంగా యాజమాన్య కోటా కింద బుధవారం అడ్మిషన్లకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఈ మేరకు టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. అర్హులైనవారు ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో ఎస్వీ ఆర్ట్స్‌, పద్మావతి డిగ్రీ పీజీ, గోవిందరాజస్వామి ఆర్ట్స్‌ కళాశాలలకు హాజరు కావాలని కోరింది. మెరిట్‌, రిజర్వేషన్ల ఆధారంగానే సీట్ల కేటాయింపు ఉంటుందని తెలిపింది. యాజమాన్య కోటాలో ప్రవేశం పొందేవారికి హాస్టల్‌ వసతి ఉండదని, జగనన్న విద్యాదీవెన పథకం ద్వారా పొందే ప్రవేశాలు న్యాయస్థానం ఉత్తర్వులకు లోబడి ఉంటాయని పేర్కొంది.

Updated Date - 2022-01-18T23:14:33+05:30 IST