షిప్యార్డులో క్రేన్ ప్రమాదంపై కలెక్టర్కు నివేదిక
ABN , First Publish Date - 2020-08-12T10:07:49+05:30 IST
హిందూస్థాన్ షిప్యార్డులో ఇటీవల క్రేన్ కుప్పకూలిన ఘటనపై విశాఖ ఆర్డీవో కె.పెంచలకిశోర్ నేతృత్వంలో ఏర్పాటైన విచారణ ..
విశాఖపట్నం, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): హిందూస్థాన్ షిప్యార్డులో ఇటీవల క్రేన్ కుప్పకూలిన ఘటనపై విశాఖ ఆర్డీవో కె.పెంచలకిశోర్ నేతృత్వంలో ఏర్పాటైన విచారణ కమిటీ మంగళవారం కలెక్టర్ వి.వినయ్చంద్కు నివేదికను అందజేశారు. ఈ కమిటీలో ఏయూకు చెందిన మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్టా్ట్రనిక్స్ విభాగాలకు చెందిన ఆచార్యులు సభ్యులుగా ఉన్నారు. కమిటీ సభ్యులు ప్రమాద స్థలాన్ని సందర్శించి పలు అంశాలను పరిశీలించారు.
సామర్థ్యం లేకపోవడంతో షిప్యార్డులో క్రేన్ కుప్పకూలిందని కమిటీ గుర్తించింది. క్రేన్ సామర్థ్యం 70 టన్నులు కాగా అదనంగా 30 టన్నులు బరువు వేసినా కాయాల్సి ఉంది. అయితే 70 టన్నులకే కుప్పకూలడంతో క్రేన్ సామర్థ్యంపై కమిటీ సందేహం వ్యక్తంచేసింది. క్రేన్ నిర్మాణానికి సంబంధించి అన్ని విషయాలు అందుబాటులో లేకపోవడంపై కమిటీ ఆశ్చర్యం వ్యక్తంచేసింది. నివేదికలో పూర్తి వివరాలు జిల్లా యంత్రాంగం వెల్లడించాల్సి ఉంది.