డ్యూటీలకు రిపోర్టు చేస్తేనే విధులకు హాజరైనట్లు

ABN , First Publish Date - 2021-05-14T08:58:56+05:30 IST

లాక్‌డౌన్‌ సమయంలో కండక్టర్లు, డ్రైవర్లు డ్యూటీకి రిపోర్టు చేస్తేనే విధులకు హాజరైనట్లు పరిగణించాలని ఆర్టీసీ ఎండీ సునీల్‌శర్మ అధికారులను ఆదేశించారు

డ్యూటీలకు రిపోర్టు చేస్తేనే విధులకు హాజరైనట్లు

ఆర్టీసీలో లాక్‌డౌన్‌ మార్గదర్శకాల జారీ


లాక్‌డౌన్‌ సమయంలో కండక్టర్లు, డ్రైవర్లు డ్యూటీకి రిపోర్టు చేస్తేనే విధులకు హాజరైనట్లు పరిగణించాలని ఆర్టీసీ ఎండీ సునీల్‌శర్మ అధికారులను ఆదేశించారు. ఆర్టీసీ కార్యాలయాలు, గ్యారేజీలు, వర్క్‌షాపుల్లో ఉద్యోగుల హాజరు 100% ఉండాలని పేర్కొంటూ.. ఉత్తర్వులు జారీ చేశారు. కార్యాలయాల్లో 100 శాతం హాజరు ఉండేలా చూడడంతో పాటు కండక్టర్లు, డ్రైవర్లు వంటి ఆపరేటింగ్‌ సిబ్బంది విషయంలో అవసరాన్ని బట్టి నిర్ణయం తీసుకోవాలని డిపో మేనేజర్లను ఆదేశించారు. రొటేషన్‌ పద్ధతిలో వీరికి విధులు కేటాయించాలని తెలిపారు. 

Updated Date - 2021-05-14T08:58:56+05:30 IST