Corona, TB రోగులకు కేంద్రం కీలక సూచన

ABN , First Publish Date - 2021-07-18T02:02:17+05:30 IST

ప్రస్తుత కరోనా కాలంలో టీబీ కేసులు పెరుగుతున్నాయనే వార్తల నడుమ కేంద్రం తాజాగా కీలక ప్రకటన చేసింది.

Corona, TB రోగులకు కేంద్రం కీలక సూచన

న్యూఢిల్లీ: ప్రస్తుత కరోనా కాలంలో టీబీ కేసులు పెరుగుతున్నాయనే  వార్తల నడుమ కేంద్రం తాజాగా కీలక ప్రకటన చేసింది. కరోనా పాజిటివ్‌గా తేలిన వారందరూ తప్పనిసరిగా టీబీ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని, అలాగే టీబీ వ్యాధిగ్రస్థులు కూడా కరోనా పరీక్షలు చేయించుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు గట్టి చర్యలు తీసుకోవాలని సూచించింది. అయితే..కరోనా కారణంగానే టీబీ కేసులు పెరుగుతున్నాయని చెప్పేందుకు ఆధారాలేవీ లేవని కూడా కేంద్రం స్పష్టం చేసింది. టీబీ, బ్లాక్ ఫంగస్ వంటి వ్యాధులు అవకాశం కోసం ఎదురుచూస్తూ బలహీనంగా ఉన్నవారిపై దాడి చేస్తాయని, కాబట్టి కరోనా నుంచి కోలుకున్న వారు తమ ఇమ్యునిటీ బలోపేతమయ్యేందుకు కోసం కృషి చేయాలని కూడా సూచించింది. 

Updated Date - 2021-07-18T02:02:17+05:30 IST