చైనాలో ఉత్పత్తి ఆపేస్తున్నామన్న వార్తలు అవాస్తవం: శామ్‌సంగ్

ABN , First Publish Date - 2020-06-21T03:24:38+05:30 IST

తమ కంపెనీకి సంబంధించిన డిస్‌ప్లే ప్రొడక్షన్‌ను చైనా నుంచి వియత్నాం తరలిస్తున్నట్లు వచ్చిన వార్తలను శామ్‌సంగ్ సంస్థ ఖండించింది.

చైనాలో ఉత్పత్తి ఆపేస్తున్నామన్న వార్తలు అవాస్తవం: శామ్‌సంగ్

బీజింగ్: తమ కంపెనీకి సంబంధించిన డిస్‌ప్లే ప్రొడక్షన్‌ను చైనా నుంచి వియత్నాం తరలిస్తున్నట్లు వచ్చిన వార్తలను శామ్‌సంగ్ సంస్థ ఖండించింది. అటువంటి ఆలోచనే తమకు లేదని తేల్చిచెప్పింది. వియత్నాంకు చెందిన ఓ న్యూస్‌పేపర్‌లో ఇటీవలే దీనిపై ఓ వార్త ప్రచురితమైంది. తమ డిస్‌ప్లే తయారీ పరిశ్రమలను శామ్‌సంగ్.. చైనా నుంచి వియత్నాం తరలిస్తున్నట్లు సదరు కథనం పేర్కొంది. దీనిపై శామ్‌సంగ్ వియత్నాం వెబ్‌సైట్‌లో ప్రకటన వచ్చినట్లు ఈ వార్తలో రాశారు. ఈ వదంతులను ఖండించిన శామ్‌సంగ్.. తమకు అటువంటి ఆలోచనలు లేవని స్పష్టంచేసింది.

Updated Date - 2020-06-21T03:24:38+05:30 IST