మొక్కలు నాటిన ప్రజాప్రతినిధులు

ABN , First Publish Date - 2022-02-16T04:41:43+05:30 IST

సీఎం కేసీఆర్‌ జన్మదినం సందర్భంగా ఎమ్మెల్యే ఎస్‌ఆర్‌రెడ్డి మంగళవారం నారాయణపేటలో రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి, చిన్నపిల్లల ఆసుపత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.

మొక్కలు నాటిన ప్రజాప్రతినిధులు
ధన్వాడలో మొక్కలు నాటుతున్న టీఆర్‌ఎస్‌ నాయకులు

- ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ

నారాయణపేట, ఫిబ్రవరి 15: సీఎం కేసీఆర్‌ జన్మదినం సందర్భంగా ఎమ్మెల్యే ఎస్‌ఆర్‌రెడ్డి మంగళవారం నారాయణపేటలో రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి, చిన్నపిల్లల ఆసుపత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. 

ధన్వాడ : మండల కేంద్రంలో మంగళవారం టీఆర్‌ ఎస్‌, యువజన విభాగం ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్‌ జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ధన్వాడ ప్రభుత్వ ఆస్పత్రిలో, బాలుర ఉన్నత పాఠశాలలో మొక్కలు నాటారు. అనంతరం ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో రాజవర్ధన్‌రెడ్డి, జడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌ సురేఖ, మండలాధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, సర్పంచ్‌ చిట్టెం అమరేందర్‌రెడ్డి, కొండారెడ్డి, శివారెడ్డి, చంద్రశేఖర్‌, మా జీ ఎంపీటీసీ సభ్యుడు శ్రీనివాసులు, సచిన్‌, పటేల్‌ నర్సిములు పాల్గొన్నారు.

మరికల్‌ : మండల కేంద్రంలో మంగళవారం టీఆర్‌ఎస్‌  మండ లాధ్యక్షుడు లంబడి తిరుపతయ్య ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్‌ జన్మదిన వేడుక లను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మరికల్‌లో  మొక్కలు నాటి అనంతరం ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ రవికుమార్‌, సర్పంచ్‌ గోవర్ధన్‌, ఎంపీటీసీ సభ్యురాలు సుజాత, మతిన్‌, చంద్రశేఖర్‌, సుధాకర్‌ పాల్గొన్నారు.

మక్తల్‌ : టీఆర్‌ఎస్‌ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ జన్మదిన వేడుకల్లో భాగంగా మంగళవారం ఆ పార్టీ మండలాధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి, అధికార ప్రతినిధి రుద్రసముద్రం రామలింగం, పట్టణ అధ్యక్షుడు అమరేంద ర్‌రెడ్డి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్‌ పంపిణీ చేశారు. ఈ నెల 18న కేసీఆర్‌ జన్మదినం సందర్భంగా  15, 16 తేదీల్లో సేవా కార్యక్ర మాలు చేపట్టాలనే కేటీఆర్‌ పిలుపు మేరకు సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు మజర్‌, సాధిక్‌, రహమత్‌ పాషా, కృష్ణయాదవ్‌, సాగర్‌, కర్రెం కృష్ణ, మహిమూద్‌, నర్సిములు, లింగప్ప, ఎల్లప్ప, రవికుమార్‌ పాల్గొన్నారు. 

దామరగిద్ద : సీఎం కేసీఆర్‌ జన్మదిన వేడుకల్లో భాగంగా మంగళవారం మండల కేంద్రంలో టీఆర్‌ఎస్‌ నాయకులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సం దర్భంగా స్థానిక కస్తూర్బా గాంధీ గురుకుల బాలికల పాఠశాలలో విద్యార్థు లకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ నర్సప్ప, నాయకులు విండో అధ్యక్షుడు పుట్టి ఈదప్ప, రైతు సమితి జిల్లా నాయకుడు వెంకట్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు ఆశన్న, రాచప్ప, తిప్పణ్ణ, బసంత్‌రాజ్‌, కన్కిరెడ్డి, కోడ్లి శరణప్ప, అశోక్‌గౌడ్‌, కోఆప్షన్‌ మెంబర్‌ ఉస్మాన్‌, చంద్రకాంత్‌, రాంరెడ్డి, నర్సప్ప, నాగప్ప, హన్మంతు ఉన్నారు.



Updated Date - 2022-02-16T04:41:43+05:30 IST