ప్రజాప్రతినిధులు..సమస్యలను పరిష్కరించాలి

ABN , First Publish Date - 2020-06-04T09:19:38+05:30 IST

ప్రజల సమస్యలను ప్రజాప్రతినిధులు పరిష్కరించాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు

ప్రజాప్రతినిధులు..సమస్యలను పరిష్కరించాలి

కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి


మేడ్చల్‌ : ప్రజల సమస్యలను ప్రజాప్రతినిధులు పరిష్కరించాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. బుధవారం మేడ్చల్‌ మున్సిపల్‌లోని కమ్యూనిటీ హెల్త్‌సెంటర్‌తోపాటు వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న సుందరీకరణ పనులను ఆయన పరిశీలించారు. అనంతరం హరితహారంలో భాగంగా మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మర్రి దీపికా నర్సింహారెడ్డి, అదనపు కలెక్టర్లు జాన్‌శాంసన్‌, విద్యాసాగర్‌, జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ భాస్కర్‌యాదవ్‌, వైస్‌చైర్మన్‌ చీర్ల రమేష్‌, కమిషనర్‌ సత్యనారాయణరెడ్డి, కౌన్సిలర్లు పాల్గొన్నారు. 


మునీరాబాద్‌లో..

మేడ్చల్‌ మండలంలోని మునీరాబాద్‌ గ్రామంలో నిర్వహించిన పల్లెప్రగతి కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, జడ్పీచైర్మన్‌ శరత్‌చంద్రారెడ్డి, కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని నర్సరీ, అంగన్‌వాడీ కేంద్రం, ప్రాథమిక ఉన్నత పాఠశాల, వైకుంఠధామాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పద్మజగన్‌రెడ్డి, జడ్పీటీసీ శైలజావిజయానందరెడ్డి, సర్పంచ్‌ గణేష్‌, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-06-04T09:19:38+05:30 IST