దేశాభివృద్ధికి పాటుపడాలి

ABN , First Publish Date - 2022-01-27T07:04:32+05:30 IST

జిల్లావ్యాప్తంగా బుధవారం 73వ గణతంత్ర దినోత్సవం ఘనంగా జరిగింది.

దేశాభివృద్ధికి  పాటుపడాలి
ఏలూరులో జాతీయ పతాకావిష్కరణ చేస్తున్న జిల్లా జడ్జ్జి భీమారావు

జిల్లావ్యాప్తంగా గణతంత్ర వేడుకల్లో వక్తల పిలుపు 

ఏలూరు, జనవరి 26(ఆంధ్రజ్యోతి): జిల్లావ్యాప్తంగా బుధవారం 73వ గణతంత్ర దినోత్సవం ఘనంగా జరిగింది. ప్రముఖులు జాతీయ పతాకాలను ఆవిష్కరించారు.  కలెక్టరేట్‌లో జేసీ హిమాన్షుశుక్లా జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడుతూ భారత రాజ్యాంగ పీఠిక మన స్వాతంత్య్ర సమరయోధులు, రాజ్యాంగ నిర్మాతల దూరదృష్టికి నిదర్శనమని కొనియాడారు. మహాత్మా గాంధీ, అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.  జేసీలు బీఆర్‌ అంబేడ్కర్‌, పద్మావతి, అసిస్టెంట్‌ కలెక్టర్‌ రాహుల్‌ కుమార్‌ జిల్లా రెవెన్యూ అధికారి డేవిడ్‌ రాజు, జాతీయ జెండాకు వందనం చేసి,  నేతలకు నివాళులు అర్పించారు.  

జిల్లా కోర్టులో గణతంత్ర వేడుకలు

ఏలూరు క్రైం: దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా ప్రధాన న్యాయ మూర్తి ఇ.భీమారావు అన్నారు. 73వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించు కుని జిల్లా కోర్టు భవనంపై జాతీయ జెండాను ఆవిష్కరించారు.  మొదటి అదనపు జిల్లా జడ్జి టి.మల్లికార్జునరావు, సీనియర్‌ సివిల్‌ జడ్జి బాలకృష్ణయ్య, ప్రిన్సిపాల్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జి శ్రీనివాసులు, అడిషనల్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జి విజయ, జ్యుడిషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మెజిస్టే్ట్రట్‌ ప్రమీలారాణి, ఏలూరు బార్‌ కార్యదర్శి రాజేంద్ర, న్యాయవా దులు పాల్గొన్నారు. కోటదిబ్బలోని ఫోక్సో కోర్టులో జడ్జి మేరీ గ్రేస్‌ జాతీయ జెండాను ఎగురవేశారు.  జిల్లా కోర్టు ఆవరణలోని బార్‌ భవనం వద్ద బార్‌ ప్రధాన కార్యదర్శి మాండ్రు రాజేంద్ర జాతీయజెండాను  ఆవిష్కరించారు. 

డీఐజీ క్యాంపు కార్యాలయంలో... 

డీఐజీ క్యాంపు కార్యాలయం వద్ద డీఐజీ కేవీ మోహనరావు జాతీయజెండాను ఆవిష్కరించారు. అదనపు ఎస్పీ సుబ్బరాజు, డీఐజీ కార్యాలయ మేనేజరు నాగరాజు పాల్గొన్నారు. అమీనాపేట  సురేష్‌ చంద్ర బహుగుణ పోలీసు స్కూల్‌ వద్ద  ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఏలూరు పోలీసు ప్రధాన కార్యాలయంలో అదనపు ఎస్పీ ఏవీ సుబ్బరాజు జెండా ఎగురవేశారు. 

జడ్పీ కార్యాలయంలో...

ఏలూరు సిటీ : ఏలూరు జిల్లా పరిషత్‌ కార్యాలయంలో జడ్పీ చైర్మన్‌ కవురు శ్రీనివాస్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు. జడ్పీ సీఈవో వై హరిహరనాథ్‌, డిప్యూటీ సీఈవో కేవీఎస్‌ఆర్‌ రవికుమార్‌,  అధికారులు,  సిబ్బంది పాల్గొన్నారు.  

ఏపీ నిట్‌లో...

తాడేపల్లిగూడెం : ఏపీ నిట్‌లో డైరెక్టర్‌ డాక్టర్‌ సూర్యప్రకాశ్‌ రావు జాతీయ పతా కాన్ని ఆవిష్కరించారు. ఇన్‌ఛార్జ్‌ రిజిస్ర్టార్‌ డాక్టర్‌ దినేష్‌ శంకర్‌ రెడ్డి పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం ఆంధ్రజ్యోతి కార్యాలయంలో బ్రాంచ్‌ మేనేజర్‌  జెండా ను ఎగురవే శారు. యాడ్స్‌ మేనేజర్‌ రాజు, సెక్యూరిటీ సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-27T07:04:32+05:30 IST