లండన్లో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు..!
ABN , First Publish Date - 2022-02-05T04:06:48+05:30 IST
లండన్ వేదికగా భారత గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. సంస్కృతి సెంటర్ ఫర్ కల్చరల్ ఎక్సెలెన్స్(ఐసీసీఆర్), నెహ్రూ సెంటర్, భారత్ హైకమిషన్, భారతీయ విద్యాభవన్ సంయుక్తంగా నిర్వహించిన ఈ వేడుకలు వీక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
లండన్ వేదికగా భారత గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. సంస్కృతి సెంటర్ ఫర్ కల్చరల్ ఎక్సెలెన్స్(ఐసీసీఆర్), నెహ్రూ సెంటర్, భారత్ హైకమిషన్, భారతీయ విద్యాభవన్ సంయుక్తంగా నిర్వహించిన ఈ వేడుకలు వీక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సంస్కృతి దర్శయామి పేరిట జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో.. భారత్లో వివిధ ప్రాంతాలకు చెందిన జానపద నాట్యరీతులు, గేయాలను కళాకారులు ప్రదర్శించారు. మాథురి(తెలంగాణ), షాండోల్(లఢఖ్), గబర్(చత్తీస్గఢ్), నిషి(అరుణాచల్ ప్రదేశ్), రభా(అసోమ్) నాట్యరీతులను దాదాపు 60 మంది కళాకారులు ప్రదర్శించారు. జాతీయ గేయంతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో.. అరుణాచల్ ప్రదేశ్, అసోం ముఖ్యమంత్రులు శుభాకాంక్షల సందేశాలున్న బుక్లెట్లను పంచిపెట్టారు. భారత హైకమిషనర్ గాయత్రీ ఇసార్, ఐసీసీఆర్ ప్రెసిడెంట్ డా. వినయ్ సహస్రబుద్ధే, నెహ్రూ సెంటర్ డైరెక్టర్ అమిష్ త్రిపాఠి చేసిన వీడియో సందేశాలను ప్రదర్శించారు. కాగా.. ఈ కార్యక్రమం రూపకల్పనలో భాగస్వాములైన రాగసుధా వింజమూరి వోట్ ఆఫ్ థ్యాంక్స్ ప్రసంగంతో వేడుకలు ముగిసాయి.