ప్రభుత్వ భూములు రక్షించాలని వినతి

ABN , First Publish Date - 2021-07-30T04:51:29+05:30 IST

పట్టణంలో ప్రభుత్వ భూములను రక్షించాలని కోరుతూ గురువారం సీపీఐ ఆధ్వర్యంలో తహసీల్దారు శ్రీనివాసులరెడ్డికి వినతిపత్రం అందించారు.

ప్రభుత్వ భూములు రక్షించాలని వినతి
తహసీల్దారుకు వినతిపత్రం ఇస్తున్న సీపీఐ నేతలు

బద్వేలు, జూలై29: పట్టణంలో ప్రభుత్వ భూములను రక్షించాలని కోరుతూ గురువారం సీపీఐ ఆధ్వర్యంలో తహసీల్దారు శ్రీనివాసులరెడ్డికి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యవర్గసభ్యుడు వీరశేఖర్‌, ఏరియా కార్యదర్శి చంద్రశేఖర్‌ మాట్లాడుతూ పట్టణంలోని చెన్నంపల్లె పొలం సర్వేంబరు 1616/4, నుంచి 1616/6 వరకు ఉన్న 4.45 సెంట్ల భూమిని సీపీఐ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పర్యటించామన్నారు. బంజరు భూములు పొందిన కొందరు నేడు అధిక ధరలకు విక్రయిస్తున్నారన్నారు.

జాతీయ రహదారి అనుకుని ఉన్న కారణంగా ఇప్పటికే భూముల ధరలు అమాంతం పెరిగాయన్నారు. రాజంపేట సబ్‌ కలెక్టర్‌ పరిశీలించి ఇక్కడ నిర్మాణాలను ఆపివేయాలన్నారు. పర్యటనలో సీపీఐ పట్టణ కార్యదర్శి జకరయ్య, జిల్లా సమితి సభ్యులు చంద్రమోహన్‌రాజు, పట్టణ నాయకురాలు రామరాజు, బాబు, సంజీ వ్‌, నరసింహ, పి.వి.రమణ, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-07-30T04:51:29+05:30 IST