‘రిజర్వేషన్లు కేటాయించాల్సిందే’

ABN , First Publish Date - 2022-01-24T05:55:30+05:30 IST

దామాషా ప్రకారం రిజర్వేషన్లు కేటాయించాల్సిందేనని ఆర్‌పీఎస్‌ జాతీయ అధ్యక్షుడు డాక్టరు పోతుల నాగరాజు అన్నారు.

‘రిజర్వేషన్లు కేటాయించాల్సిందే’

కర్నూలు(అర్బన్‌), జనవరి 23: దామాషా ప్రకారం రిజర్వేషన్లు కేటాయించాల్సిందేనని ఆర్‌పీఎస్‌ జాతీయ అధ్యక్షుడు డాక్టరు పోతుల నాగరాజు అన్నారు. ఆదివారం నగరంలోని బిర్లా గేట్‌ వద్ద ఉన్న జ్యోతిరావు పూలే విగ్రహాం ఎదుట రిజర్వేషన్ల పరిరక్షణ సమితి, రిజర్వేషన్ల ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ నాయకుడు టి. శేషుఫణి ఆధ్వర్యంలో సామాజిక న్యాయ దీక్ష కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేఽశంలో 56 శాతం ఉన్న బీసీలకు చట్ట సభలలో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించినట్లే బీసీలకు కల్పించాలని డిమాండ్‌ చేశారు. మహిళా ఐక్యవేదిక నాయకురాలు పట్నం రాజేశ్వరి, వై. నాగేశ్వరయాదవ్‌, విద్యార్థి నాయకులు భరత్‌కుమార్‌, ఎస్‌ శ్రీనివాసులు. లాయర్స్‌ అసోసియేషన్‌ నాయకుడు నరసింహులు, వడ్డ్డెర సంఘం నాయకుడు బత్తుల లక్ష్మీ కాంతయ్య పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-24T05:55:30+05:30 IST