రెసిడెన్సీ, విజిట్ వీసా హోల్డర్స్కు యూఏఈ గుడ్న్యూస్
ABN , First Publish Date - 2020-04-02T19:13:47+05:30 IST
రెసిడెన్సీ, విజిటింగ్ వీసాదారులకు యూఏఈ సర్కార్ తీపి కబురు అందించింది.
యూఏఈ: రెసిడెన్సీ, విజిటింగ్ వీసాదారులకు యూఏఈ సర్కార్ తీపి కబురు అందించింది. కరోనావైరస్ కారణంగా దేశంలో నెలకొన్న విపత్కర పరిస్థితుల దృష్ట్యా రెసిడెన్సీ, విజిట్ వీసా హోల్డర్లకు మూడు నెలల పాటు ఓవర్స్టే జరిమానా నుండి మినహాయింపు ఇస్తున్నట్లు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. వీరితో పాటు యూఏఈ బయట ఉన్నవారికి కూడా జరిమానా నుండి మినహాయింపు ఇస్తున్నట్లు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారినర్స్ అఫైర్స్(జీడీఆర్ఎఫ్ఎ) డైరెక్టర్ మేజర్ జనరల్ మొహమ్మద్ అహ్ మెడ్ అల్ మర్రి తెలిపారు. ఇక యూఏఈలో కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగానే ఉంది. ఇప్పటివరకు 814 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఎనిమిది మంది చనిపోయారు.