ఐటీ, ఎలక్ర్టానిక్స్‌ విద్యార్థులకు రిసోర్స్‌ సెంటర్‌

ABN , First Publish Date - 2021-05-14T09:09:28+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ ఐటీ అకాడమీ (ఎపిటా) ఆధ్వర్యంలో ఐటీ, ఎలక్ర్టానిక్స్‌ విద్యార్థులకు అకడమిక్‌ రిసోర్స్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియం దగ్గర వార్డు సచివాలయంలో ఏ

ఐటీ, ఎలక్ర్టానిక్స్‌ విద్యార్థులకు  రిసోర్స్‌ సెంటర్‌

ఆంధ్రప్రదేశ్‌ ఐటీ అకాడమీ (ఎపిటా) ఆధ్వర్యంలో ఐటీ, ఎలక్ర్టానిక్స్‌ విద్యార్థులకు అకడమిక్‌ రిసోర్స్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియం దగ్గర వార్డు సచివాలయంలో ఏర్పాటు చేసిన ఈ సెంటర్‌ను మంత్రి గౌతమ్‌ రెడ్డి వర్చువల్‌గా ప్రారంభించారు. ఐ టీ, ఎలక్ర్టానిక్స్‌ విద్యార్థులకు అవసరమైన సమాచారం, ఆధునిక టెక్నాలజీల అధ్యయనానికి ఈ రిసోర్స్‌ సెంటర్‌ ఉపయోగపడుతుంది. సమగ్ర సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రాం, కోడింగ్‌ సౌకర్యాలు కూడా ఇందులో ఉన్నాయి. 

Updated Date - 2021-05-14T09:09:28+05:30 IST