ఆస్పత్రిలో మీడియాపై మళ్లీ ఆంక్షలు
ABN , First Publish Date - 2021-05-11T06:38:30+05:30 IST
జి ల్లా సర్వజనాస్పత్రిలో మళ్లీ మీడియాపై పో లీసులు ఆంక్షలు పె ట్టారు. సోమవారం మామూలుగానే మీ డియా ప్రతినిధులు కవరేజీ నిమిత్తం ఆ స్పత్రికెళ్లారు
తప్పుబట్టిన జర్నలిస్టులు, ప్రతిపక్షాలు
అనంతపురం వై ద్యం, మే10: జి ల్లా సర్వజనాస్పత్రిలో మళ్లీ మీడియాపై పో లీసులు ఆంక్షలు పె ట్టారు. సోమవారం మామూలుగానే మీ డియా ప్రతినిధులు కవరేజీ నిమిత్తం ఆ స్పత్రికెళ్లారు. అప్పటి కే పలువురు పోలీసు లు ఆస్పత్రి ప్రధాన గేట్ వద్ద పహారా కాస్తూ ఉండిపోయారు. మీడియా ప్రతినిధులను లోపలికి పంపకుండా అడ్డుకున్నారు. లోపలికెళ్లిన ఏబీఎన్-ఆంధ్రజ్యోతి వీడియోగ్రాఫర్ను పోలీసులు వెళ్లి, బయటకు తీసుకొచ్చారు. కలెక్టర్ ఎలాంటి ఆంక్షలు లేవని ప్రకటన ఇచ్చారనీ, ఆ వీడియో గ్రాఫర్ చూపించినా పోలీసులు పట్టించుకోలేదు. మీడియాను లోపలికి పంపవద్దని తమకు ఆదేశాలున్నాయని చెప్పుకొచ్చారు. ఏబీఎన్-ఆంధ్రజ్యోతి వీడియోగ్రాఫర్ను వెనక్కి పంపారు. ఉన్నతాధికారుల తీరును జర్నలిస్టులు, ప్రతిపక్షాలు తప్పుబట్టాయి. కరోనాను నియంత్రించాల్సిందిపోయి ప్రాణాలకు తెగించి, కరోనా బాధితులకు అందుతున్న సేవలతోపాటు వారు పడుతున్న కష్టాలను అధికారుల దృష్టికి తీసుకొస్తున్న మీడియాకు ఆంక్షలు పెట్టడం ఏంటని మండిపడ్డారు. కలెక్టర్, ఎస్పీలు పునరాలోచించాలని జర్నలిస్టులు డిమాండ్ చేశారు.