అప్పన్న ఆర్జిత సేవలు పునఃప్రారంభం
ABN , First Publish Date - 2022-01-19T05:34:31+05:30 IST
వరాహలక్ష్మీనృసింహస్వామి సన్నిధిలో నిత్యకల్యాణం తదితర ఆర్జిత సేవలు మంగళవారం పునఃప్రారంభమయ్యాయి. ధనుర్మాసోత్సవాలను పురస్కరించుకుని సుమారు 20 రోజులుగా ఈ సేవలు నిలిపివేశారు. స్వామివారి నిత్య కల్యాణోత్సవంతో తిరిగి ప్రారంభించారు.
సింహాచలం, జనవరి 18: వరాహలక్ష్మీనృసింహస్వామి సన్నిధిలో నిత్యకల్యాణం తదితర ఆర్జిత సేవలు మంగళవారం పునఃప్రారంభమయ్యాయి. ధనుర్మాసోత్సవాలను పురస్కరించుకుని సుమారు 20 రోజులుగా ఈ సేవలు నిలిపివేశారు. స్వామివారి నిత్య కల్యాణోత్సవంతో తిరిగి ప్రారంభించారు. కొవిడ్ను దృష్టిలో ఉంచుకుని పరిమిత సంఖ్యలో మాత్రమే భక్తులను అనుమతించనున్నారు. ప్రత్యక్షంగా పాల్గొనదలచిన భక్తులు దేవస్థానం కౌంటర్లో టిక్కెట్లు తీసుకోవాలని, ఆన్లైన్లో కూడా భక్తులు ఆర్జిత సేవల్లో పాల్గొనవచ్చని అధికారులు తెలిపారు.