HYD : హత్యకు ప్రతీకార దాడులు.. అనుమానితుల ఇళ్లకు నిప్పు

ABN , First Publish Date - 2022-01-15T15:40:07+05:30 IST

హత్య కేసులో అనుమానితుల ఇళ్లకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు..

HYD : హత్యకు ప్రతీకార దాడులు.. అనుమానితుల ఇళ్లకు నిప్పు

హైదరాబాద్ సిటీ/అడ్డగుట్ట : హత్య కేసులో అనుమానితుల ఇళ్లకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. ఈ సంఘటన లాలాగూడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శుక్రవారం జరిగింది. మౌలాలికి చెందిన ఆటో డ్రైవర్‌ రాజేష్‌ ఈనెల 13న రాత్రి శాంతినగర్‌లో ముగ్గురు దారుణంగా కత్తులతో పొడిచి హత్య చేశారు. అయితే, ఈ ఘటనలో అనుమానితులు అంటూ కొందరు వారి ఇళ్లకు నిప్పు పెట్టారు. అగ్నిమాపక సిబ్బంది  వచ్చి మంటలను ఆర్పారు. ఓ ఇంట్లో రెండు గదులు ఉండగా, ఒక గదిలో అద్దెకు ఉన్న వ్యక్తిని బయటకు వెళ్లిపోవాలని బెదిరించి, ఇంటికి నిప్పు పెట్టారు.  మరో ఇంటికి తాళం ఉన్న గదికి నిప్పుపెట్టి పారిపోయారు. లాలాగూడ పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి వివరాలు సేకరించారు.

Updated Date - 2022-01-15T15:40:07+05:30 IST