రిటైర్డ్‌ ఉపాధ్యాయుడి ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-11-26T05:42:05+05:30 IST

యూటీఎఫ్‌ ఫౌండర్‌, రిటైర్డ్‌ ఉపాధ్యా యుడు(86) బుధవారం ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

రిటైర్డ్‌ ఉపాధ్యాయుడి ఆత్మహత్య

ఆదిలాబాద్‌టౌన్‌, నవంబరు 25: యూటీఎఫ్‌ ఫౌండర్‌, రిటైర్డ్‌ ఉపాధ్యా యుడు(86) బుధవారం ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని భు క్తాపూర్‌ కాలనీలో నివాసం ఉంటు న్న రిటైర్డ్‌ ఉపాధ్యాయుడు సాహిరి నర్సయ్య పక్షం రోజులుగా కరోనా వైరస్‌తో బాధపడుతున్నారు. హోం ఐసోలేషన్‌లో ఉన్న ఈయన తన కుటుంబ సభ్యులకు ఇబ్బందులకు గురిచేయడం సమంజసంకాదని భావించి, హోంఐసోలేషన్‌లో ఉంటున్న నివాసంలోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. కాగా, ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా యూటీఎఫ్‌ ఫౌండర్‌గా పేరొందిన ఈయన గత కొన్ని సంవ త్సరాలుగా ఒంటరిగానే నివాసం ఉంటున్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడి గానూ ఎన్నికయ్యారు. కరోనా వైరస్‌ భారిన పడి హోంఐసోలేషన్‌లో ఉంటున్న ఆయన ఆత్మన్యూనత భావానికి లోనై ఆత్మహత్య చేసుకున్నట్లు వారి బంధువులు తెలిపారు. కొవిడ్‌ నిబంధనల ప్రకారం జిల్లా కేంద్రంలోని శివారు ప్రాంతంలో ఆయనకు అంత్యక్రియలు నిర్వహించారు.

Updated Date - 2020-11-26T05:42:05+05:30 IST