తహసీల్దార్ పై రిటైర్డ్ హెడ్మాస్టర్ కత్తితో దాడి.. అక్కడికక్కడే మృతి
ABN , First Publish Date - 2020-07-10T02:24:09+05:30 IST
కుప్పం సరిహద్దు ప్రాంతం కర్ణాటక బంగారుపేటలో దారుణం చోటు చేసుకుంది. తహసీల్దార్ పై రిటైర్డ్ హెడ్మాస్టర్ అతి దారుణంగా కత్తితో దాడి చేశారు.
చిత్తూరు: కుప్పం సరిహద్దు ప్రాంతం కర్ణాటక బంగారుపేటలో దారుణం చోటు చేసుకుంది. తహసీల్దార్ పై రిటైర్డ్ హెడ్మాస్టర్ అతి దారుణంగా కత్తితో దాడి చేశారు. కామసముద్రం వద్ద కలవంచి గ్రామంలో భూమి సర్వే చేయడానికి వెళ్లిన తహసీల్దార్ను రిటైర్డ్ హెడ్మాస్టర్ వెంకటచలపతి కత్తితో పొడిచారు. దాడిలో తీవ్రగాయాలపాలైన తహసీల్దార్ అక్కడికక్కడే మృతి చెందారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. తహసీల్దార్ పై దాడి చేయడానికి గల కారణాలను నిందితుడి నుంచి తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.