తూటా పేల్చితే.. మొదటి వరుసలో నేనే ఉంటా: రేవంత్

ABN , First Publish Date - 2021-10-02T18:15:26+05:30 IST

దిల్‌సుఖ్‌నగర్‌ నుంచి ఎల్బీనగర్‌ వరకు కాంగ్రెస్‌ నిరుద్యోగ జంగ్‌ సైరన్‌ ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్‌ కార్యకర్తలంతా దిల్‌సుఖ్‌నగర్‌ రావాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

తూటా పేల్చితే.. మొదటి వరుసలో నేనే ఉంటా: రేవంత్

హైదరాబాద్: దిల్‌సుఖ్‌నగర్‌ నుంచి ఎల్బీనగర్‌ వరకు కాంగ్రెస్‌ నిరుద్యోగ జంగ్‌ సైరన్‌ ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్‌ కార్యకర్తలంతా దిల్‌సుఖ్‌నగర్‌ రావాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ... ‘‘లాఠీచార్జ్‌ చేస్తే మొదటి దెబ్బ నేనే తింటా. తూటా పేల్చితే.. మొదటి వరుసలో నేనే ఉంటా. రాష్ట్రానికి గులాబీ చీడ నుంచి విముక్తి కోసమే కాంగ్రెస్‌ కార్యక్రమం తీసుకుంది. శాంతియుత పోరాటాలు చేయాల్సిన బాధ్యత యువతపై ఉంది. శాంతియుత మార్గంలో ఏదైనా సాధించవచ్చని నిరూపించిన వ్యక్తి గాంధీ. రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ పాలన సాగుతుంది. మోదీ, అమిత్‌షాలు దేశాన్ని అంబానీ, ఆదానీ చేతిలో పెడుతున్నారు. విద్యార్థి సమస్యలపై 65 రోజులపాటు జంగ్ సైరన్ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తాం. ర్యాలీ కోసం వస్తున్నవారిని అరెస్ట్‌ చేయడం సరికాదు’’ అని పేర్కొన్నారు.  

Updated Date - 2021-10-02T18:15:26+05:30 IST