ఈటలను సూటిగా ప్రశ్నించిన రేవంత్

ABN , First Publish Date - 2021-10-28T00:03:06+05:30 IST

మాజీమంత్రి ఈటల రాజేందర్‌ను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సూటిగా ప్రశ్నించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వాటాలు

ఈటలను సూటిగా ప్రశ్నించిన రేవంత్

హుజురాబాద్‌: మాజీమంత్రి ఈటల రాజేందర్‌ను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సూటిగా ప్రశ్నించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వాటాలు, కమీషన్ల కోసమే సీఎం కేసీఆర్‌తో ఈటల తగవు పెట్టుకున్నారని ఆరోపించారు. అధికారంలో ఉన్నప్పుడు సమస్యలపై ఈటల ఎందుకు మాట్లాడలేదు?.. ఉద్యోగాల భర్తీ కోసం ఈటల ఎప్పుడైనా పోరాడారా? అని ప్రశ్నించారు. దళితులకు మూడెకరాల గురించి ఈటల ఎప్పుడైనా ప్రశ్నించారా అని నిలదీశారు. మంత్రి హరీష్‌రావు, ఈటల 20 ఏళ్లు కలిసి తిరగలేదా? అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ఉప ఎన్నికలలో మోదీకి, కేసీఆర్‌కు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఇద్దరూ కలిసి లీటర్‌ పెట్రోల్‌ ధరను రూ.110 చేశారని, గ్యాస్‌ సిలిండర్‌ ధరను కూడా రూ.1000 చేశారని రేవంత్‌రెడ్డి దుయ్యబట్టారు.

Updated Date - 2021-10-28T00:03:06+05:30 IST