బీజేపీ నేతలపై రేవంత్రెడ్డి ఫైర్
ABN , First Publish Date - 2020-11-22T20:18:48+05:30 IST
బీజేపీ నేతలపై రేవంత్రెడ్డి ఫైర్
హైదరాబాద్: బీజేపీ నేతలపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్రెడ్డి మండిపడ్డారు. బీజేపీ నాయకులను తయారు చేసుకోలేక కాంగ్రెస్ నేతల ఇళ్ల చుట్టూ తిరుగుతూ కాళ్లపై పడుతోందని ఎంపీ రేవంత్రెడ్డి విమర్శించారు. జనసేనతో పొత్తు లేదంటూనే పవన్ కల్యాణ్ మద్దతు కోరారని పేర్కొన్నారు. శ్రీశైలం, కల్వకుర్తి ప్రాజెక్టుల్లో అక్రమాలపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? అని ప్రశ్నించారు. నదీ పరివాహక ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలపై జవదేకర్కు ఫిర్యాదు చేశానని తెలిపారు. తెలంగాణను కేసీఆర్, కేటీఆర్ కాలుష్యం చేస్తున్నారని ఎన్నో లేఖలు రాశా.. ఇంత వరకు చర్యలు లేవన్నారు. ప్రకాష్ జవదేకర్కి చిత్తశుద్ధి ఉంటే చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. కేంద్రం కోట్లు విడుదల చేస్తే మంత్రి కేటీఆర్ సన్నిహితులు అక్రమంగా దోచేశారని జవదేకర్కు ఫిర్యాదు చేసినా ఫలితం లేదన్నారు.