వలస కూలీల మన్ కీ బాత్ను మోదీ వినాలి: రేవంత్రెడ్డి
ABN , First Publish Date - 2020-05-28T22:12:36+05:30 IST
హైదరాబాద్: కరోనా కారణంగా ఇబ్బంది పడుతున్న వలస కార్మికులను ఆదుకోవడం లేదని కాంగ్రెస్ ఎంపీ రేవంత్రెడ్డి పేర్కొన్నారు
హైదరాబాద్: కరోనా కారణంగా ఇబ్బంది పడుతున్న వలస కార్మికులను ఆదుకోవడం లేదని కాంగ్రెస్ ఎంపీ రేవంత్రెడ్డి పేర్కొన్నారు. చిన్న తరహా పరిశ్రమలకు కేంద్రం ఆర్థికసాయం చేయాలని డిమాండ్ చేశారు. వచ్చే 6 నెలలు రూ.7500 చొప్పున పేద కుటుంబాలకు సాయం చేయాలన్నారు. పేదలు, వలసకూలీల మన్ కీ బాత్ను మోదీ వినాలని రేవంత్ పేర్కొన్నారు. రక్షణశాఖ బడ్జెట్లో కోత విధించాలని.. దుబారాను తగ్గించాలని కోరారు. స్విస్ బ్యాంక్ నుంచి నల్లధనం తెచ్చి.. పేదల బ్యాంక్ ఖాతాల్లో రూ.15 లక్షల చొప్పున వేయాలని రేవంత్రెడ్డి సూచించారు.